Chittoor District: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురి మృతి

  • కెవిపల్లి మండలం మహల్ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం
  • కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కెవిపల్లి మండలం మహల్ క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. కారును ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News