Janasena party: ఈ నెల 30న ‘జనసేన’ విస్తృత స్థాయి సమావేశం

  • మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం
  • ఆ రోజు ఉదయం 11 గంటలకు భేటీ
  • పలు అంశాలపై చర్చించనున్న ‘జనసేన’ నేతలు

జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో విస్తృతస్థాయి సమావేశాన్ని ఈ నెల 30వ తేదీన నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం అవుతుందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులు, అమరావతి గ్రామాల ప్రజలు - రైతుల ఆందోళన, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆశలు - ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రత, జనసేన స్టాండ్, పార్టీ పరంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు తదితర అంశాలపై కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపింది. ఈ సమావేశంలో జనసేన పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ, పార్టీ వ్యూహాత్మక కమిటీ, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ, ముఖ్య నేతలు పాల్గొంటారని పేర్కొంది.

More Telugu News