Guntur District: గుంటూరు, కృష్ణా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం

  • క్యాంపు కార్యాలయంలో సమావేశం
  • హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి
  • రైతుల ఆందోళనలపైనా చర్చ!

ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గుంటూరు, కృష్ణా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఏపీకి 3 రాజధానుల ప్రతిపాదనపై సీఎం రెండు జిల్లాల నేతలతో చర్చించారు. రాజధానిలో రైతుల ఆందోళనపైనా ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. కాగా, అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సీఎం జగన్ పార్టీ నేతలతో మాట్లాడారు.

More Telugu News