Hyderabad: హైదరాబాద్ లో సార్వజనిక సభ.. భారీగా తరలివచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు

  • సరూర్ నగర్  స్టేడియంలో సభ
  • భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు  
  • ముఖ్యఅతిథిగా బీవీఆర్ మోహన్ రెడ్డి

హైదరాబాద్ లోని సరూర్ నగర్  స్టేడియంలో సార్వజనిక సభ ప్రారంభమైంది. ఈ సభకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ముఖ్యఅతిథి బీవీఆర్ మోహన్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి ముకుందాజీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు చేరుకున్నారు. అంతకుముందు, సరూర్ నగర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్వయం సేవకుల పథ సంచలన్ ఆకట్టుకుంది.

More Telugu News