Disha: 'దిశ' నిందితుల మృతదేహాల రీపోస్టుమార్టం వీడియో, నివేదిక హైకోర్టుకు అందజేత

  • నిన్న రీపోస్టుమార్టం పూర్తి
  • ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్‌ ప్రత్యేక వైద్య బృందం 
  • రీపోస్టుమార్టం ప్రాథమిక నివేదిక కూడా హైకోర్టుకు అందజేత

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'దిశ' హత్యాచార కేసులో నలుగురు నిందితులు పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలకు సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో సోమవారం ఢిల్లీ ఎయిమ్స్‌ బృందం రీపోస్టు మార్టం ప్రక్రియను పూర్తి చేసింది. హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను ముగించారు.

ఈ రోజు ఆ రీపోస్టుమార్టం వీడియో హైకోర్టుకు చేరింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్‌ ప్రత్యేక వైద్య బృందం రీపోస్టుమార్టం ప్రాథమిక నివేదికను కూడా హైకోర్టు రిజిస్ట్రార్‌కు అందజేసింది. మరో వారం రోజుల్లో రీపోస్టు మార్టంకు సంబంధించిన సమగ్ర నివేదికను అందించనున్నారు. ఈ నెల 6న షాద్‌నగర్‌ శివారు చటాన్‌పల్లి వద్ద దిశ నిందితులు మహ్మద్‌ ఆరిఫ్‌, జొల్లు శివ, జొల్లు నవీన్‌, చింతకుంట చెన్నకేశవులు పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన  విషయం తెలిసిందే. 

More Telugu News