MS Dhoni: అరుదైన గౌరవం... ఈ దశాబ్దపు ఆసీస్ వన్డే క్రికెట్ కెప్టెన్ గా ధోనీని ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా!

  • 2010-2019 క్రికెట్ జట్ల ప్రకటన
  • వన్డే జట్టులో ధోనీ, కోహ్లీ, రోహిత్
  • టెస్టు జట్టులో కోహ్లీకి మాత్రమే స్థానం

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మరో అరుదైన గౌరవం దక్కింది. సీఏ (క్రికెట్ ఆస్ట్రేలియా) ప్రకటించిన ఈ దశాబ్దపు ఆసీస్ క్రికెట్ జట్టుకు ధోనీని కెప్టెన్ గా ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది. ధోనీతో పాటు భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పేర్లనూ చేర్చింది. ఈ జట్టులో ఒకే ఒక్క ఆసీస్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ మాత్రమే వుండడం గమనార్హం.

ఇక ఈ టీమ్ లో దక్షిణాఫ్రికా నుంచి హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్, బంగ్లాదేశ్ కు చెందిన షకీబుల్ హసన్, ఇంగ్లండ్ కు చెందిన జోస్ బట్లర్, శ్రీలంక నుంచి లసిత్ మలింగా, ఆఫ్ఘనిస్థాన్ నుంచి రషీద్ ఖాన్, న్యూజిలాండ్ నుంచి ట్రెంట్ బౌల్ట్ కు స్థానం లభించింది. ఇదిలావుండగా, సీఏ ప్రకటించిన ఆసీస్ టెస్ట్ జట్టులో మాత్రం భారత్ నుంచి విరాట్ కోహ్లీని మాత్రమే చేర్చిన ఆసీస్, అతనికి కెప్టెన్ హోదాను ప్రకటించింది.

2010-2019 సీఏ వన్డే జట్టు: ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌-వికెట్‌ కీపర్‌), రోహిత్‌ శర్మ, హషీమ్‌ ఆమ్లా, విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌, షకీబుల్‌ హసన్‌, జోస్‌ బట్లర్‌, రషీద్‌ ఖాన్‌, మిచెల్‌ స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, లసిత్‌ మలింగా.

2010-2019 సీఏ టెస్టు జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), అలెస్టర్‌ కుక్‌, డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌, ఏబీ డివిలియర్స్‌ (వికెట్‌ కీపర్‌), బెన్‌ స్టోక్స్‌, డేల్‌ స్టెయిన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, నాథన్‌ లయన్‌, జేమ్స్‌ అండర్సన్‌.

More Telugu News