Sai tej: 'ప్రతిరోజూ పండగే' 3 రోజుల వసూళ్లు

  • తొలి ఆటతోనే సక్సెస్ టాక్ 
  • మూడు తరాల మధ్య నడిచే కథ 
  • 3 రోజుల్లో 23 కోట్లకి పైగా వసూళ్లు 

సాయితేజ్ .. రాశి ఖన్నా జంటగా దర్శకుడు మారుతి 'ప్రతిరోజు పండగే' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ నెల 20వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. కామెడీని .. ఎమోషన్ ను కలుపుకుని ఈ సినిమా దూసుకుపోతోంది.

తొలి మూడు రోజుల్లో  ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 23 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. ఈ రోజుతో 25 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టవచ్చని అంటున్నారు. తేజూ కెరియర్లో ఇవి అత్యధిక వసూళ్లని చెబుతున్నారు. ఈ సినిమాలో సత్యరాజ్ - రావు రమేశ్ పాత్రలు బలమైనవిగా నిలిచాయి. తండ్రీ కొడుకులుగా ఈ ఇద్దరి మధ్య చోటుచేసుకున్న సన్నివేశాలు కీలకంగా నిలిచాయి. తాత .. తండ్రి .. మనవడు .. ఇలా మూడు తరాల వ్యక్తుల చుట్టూ తిరిగే ఈ కథ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.

More Telugu News