cm: రోహింగ్యాల కన్నా ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లే రాక్షసులు: సీపీఐ నేత నారాయణ

  • పౌరసత్వ సవరణ చట్టంతో ఒరిగేదేమీ లేదు
  • ఓట్ల కోసం మతం పేరిట దీనిని తీసుకొచ్చారు
  • జగన్ ది మూడు ముక్కల ఆట

ఏపీకి మూడు రాజధానుల అంశం, జాతీయ పౌరసత్వ సవరణ చట్టంపై సీపీఐ నారాయణ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్, బీజేపీ, సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ది మూడు ముక్కల ఆట అని, ఆయనది నెగెటివ్ ట్రెండ్ అని విమర్శించారు. ఇక, పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడుతూ, దీని వల్ల దేశానికి ఒరిగేదేమీ లేదని, ఓట్ల కోసం మతం పేరుతో దీనిని తీసుకొచ్చారని విమర్శించారు. రోహింగ్యాల కన్నా ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లే రాక్షసులని తీవ్రమైన విమర్శలు చేశారు.

More Telugu News