Disha: దిశ నిందితులలో ఎవరెవరికి ఎన్ని బుల్లెట్ గాయాలయ్యాయంటే..!

  • దిశ నిందితుల మృతదేహాలకు కొనసాగుతున్న రీపోస్టుమార్టం
  • ఆరిఫ్ శరీరంలో నాలుగు, చెన్నకేశవులు శరీరలో మూడు బుల్లెట్ గాయాలు
  • నవీన్ కు రెండు, శివకు ఒక బుల్లెట్ గాయం

ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన దిశ హంతకుల మృతదేహాలకు రీపోస్టుమార్టం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు ఎయిమ్స్ వైద్య బృందం కూడా పాల్గొంది. రీపోస్టుమార్టం సందర్భంగా నిందితులకు తగిలిన బుల్లెట్ గాయాలపై ఒక క్లారిటీ వచ్చింది. ఏ1 మహమ్మద్ ఆరిఫ్ శరీరంలో నాలుగు బుల్లెట్ గాయాలను గుర్తించారు. ఏ2 చెన్నకేశవులు శరీరంలో మూడు బుల్లెట్లు, ఏ3 నవీన్ శరీరంలో రెండు బుల్లెట్లు, ఏ4 శివ శరీరంలో ఒక బుల్లెట్ గాయాన్ని గుర్తించారు. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత రిపోర్టును సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించనున్నారు.

More Telugu News