Philippines: పార్టీలో కొబ్బరి వైన్ తాగి 11 మంది మృతి.. 300 మందికి చికిత్స

  • ఫిలిప్పీన్స్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విషాదం
  • మరో 11 మందికి ఆసుపత్రిలో చికిత్స
  • గత ఏడాది కూడా ఈ వైన్ వల్ల 21 మంది బలి

కొబ్బరి వైన్ 11 మంది ప్రాణాలను బలిగొన్న ఘటన ఫిలిప్పీన్స్ లో చోటు చేసుకుంది. దక్షిణ మనీలాలో జరిగిన ఓ క్రిస్మస్ పార్టీ సందర్భంగా అక్కడున్న వారు కొబ్బరి వైన్ ను తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నగర మేయర్ ఆదేశానుసారం వీరిలో చాలా మందికి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. గత గురువారం నుంచి నిన్నటి వరకు ఈ మరణాలు సంభవించాయని మేయర్ తెలిపారు.  

ఫిలిప్పీన్స్ లో ఈ వైన్ కు ఎంతో ఆదరణ ఉంది. ఫంక్షన్లలో ఈ వైన్ ను విరివిగా స్వీకరిస్తారు. చాలా మంది వీటిని సొంతంగా కూడా తయారు చేసుకుంటుంటారు. అయితే, మిథనాల్ వంటి వాటిని ఈ వైన్ కు కలుపుతుండటంతో... ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతోంది. గత ఏడాది కూడా ఈ వైన్ వల్ల అక్కడ 21 మంది చనిపోయారు.

More Telugu News