Chandrababu: ప్రతిపక్షంలో ఉన్నా, అన్ని వేళలా అండగా ఉంటాను: చంద్రబాబునాయుడు

  • నేడు జాతీయ రైతు దినోత్సవం
  • అన్నం పెట్టే రైతు రుణం తీర్చుకుంటా
  • ట్విట్టర్ లో చంద్రబాబునాయుడు

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజలు, రైతులకు అన్ని వేళలా అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. నేడు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ట్వీట్లు పెట్టారు. "మాజీ ప్రధాని, స్వర్గీయ చౌదురీ చరణ్ సింగ్ రైతుల కోసం చేసిన ఉద్యమాలు, తెచ్చిన సంస్కరణలు చిరస్మరణీయం. అలాంటి రైతు బాంధవుని జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్న ఈవేళ అన్నదాతలందరికీ శుభాకాంక్షలు" అని అన్నారు.

ఆపై, "సమాజానికి అన్నం పెట్టే రైతు ఋణం తీర్చుకోడానికి, గత ఐదేళ్ళ తెదేపా హయాంలో అన్నదాతల ఆనందానికి బాటలు వేసి, రైతు ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్నా మాది రైతుపక్షమే. అన్నివేళలా మీకు తెదేపా అండగా ఉంటుందని ఈ రైతు దినోత్సవ వేళ మరోసారి గుర్తుచేస్తున్నాను" అని మరో ట్వీట్ పెట్టారు. 

More Telugu News