Jharkhand: ఝార్ఖండ్ తొలి ట్రెండ్స్... బీజేపీ, జేఎంఎం పోటాపోటీ... వెనకే వస్తున్న కాంగ్రెస్!

  • 52 స్థానాల్లో ట్రెండ్స్
  • 18 చోట్ల ఆధిక్యంలో బీజేపీ
  • 17 చోట్ల జేఎంఎం ముందంజ

ఝార్ఖండ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల సరళి వెలువడుతోంది. మొత్తం 81 స్థానాలకు ఐదు దఫాలుగా ఎన్నికలు జరుగగా, ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, మొత్తం 52 స్థానాల్లో ఆధిక్యాలు వెల్లడయ్యాయి. బీజేపీ అత్యధికంగా 18 స్థానాల్లో ముందంజలో ఉండగా, ఝార్ఖండ్ ముక్తి మోర్చా గట్టి పోటీని ఇస్తూ, 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో ఏజేఎస్యూ 4 స్థానాల్లో ఆర్జేడీ 2 స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

More Telugu News