India: కటక్ వన్డేలో టీమిండియా సూపర్ చేజింగ్... సిరీస్ కైవసం

  • మూడో వన్డేలో భారత్ విజయం
  • 2-1తో సిరీస్ వశం
  • రాణించిన టీమిండియా టాపార్డర్
  • చివర్లో ఆకట్టుకున్న జడేజా, ఠాకూర్

కటక్ లో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 316 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత్ 48.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలకు చేరింది. తొలుత రోహిత్ శర్మ (63), కేఎల్ రాహుల్ (77) పటిష్టమైన పునాది వేయగా, ఆపై కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో 85 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఓ దశలో వరుసగా వికెట్లు పడినా రవీంద్ర జడేజా (39 నాటౌట్), శార్దూల్ ఠాకూర్ (6 బంతుల్లో 17 పరుగులు) మొండిపట్టుదలతో పోరాడి టీమిండియాను గెలిపించారు.

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1తో చేజిక్కించుకుంది.  ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 315 పరుగులు చేసింది. యువ ఆటగాడు నికోలాస్ పూరన్ 89, కెప్టెన్ కీరన్ పొలార్డ్ 74 పరుగులతో రాణించారు.

More Telugu News