Andhra Pradesh: ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

  • నలభై ఐదు మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
  • ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
  • ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి  ప్రవీణ్ ప్రకాశ్ పేరిట ఉత్తర్వులు

ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. నలభై ఐదు మందిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్ ప్రకాశ్ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ అయిన డిప్యూటీ కలెక్టర్లలో ఎన్. మధుసూదన్ రావు, వి. డేవిడ్ రాజు, డి.రామునాయక్, జి. నరసింహులు, ఎన్.సి.సుబ్రహ్మణ్యం, కె. బాలత్రిపురసుందరి తదితరులు ఉన్నారు.

More Telugu News