Nampally: నాంపల్లి స్టేషన్ వద్ద సులభ్ కాంప్లెక్స్ లో తుపాకుల కలకలం

  • సులభ్ కాంప్లెక్స్ లో 2 నాటు తుపాకులు లభ్యం
  • స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • కేసు నమోదు

హైదరాబాదులోని నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నాటు తుపాకులు లభ్యమైన ఘటన కలకలం రేపింది. ఇక్కడి సులభ్ కాంప్లెక్సులో రెండు నాటు తుపాకులు కనిపించడంతో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ కు వచ్చిన ఎవరైనా సులభ్ కాంప్లెక్సులో తుపాకులను దాచి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News