Andhra Pradesh: రాజధాని వికేంద్రీకరణను సమర్దిస్తూ రావులపాలెంలో ర్యాలీ

  • ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొడతాం
  • రాజధాని వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం
  • టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ

ఏపీ రాజధాని వికేంద్రీకరణను సమర్ధిస్తూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, రాజధాని వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొడతామని హెచ్చరించారు.

More Telugu News