KCR: ఢిల్లీలో ప్రధాని కాళ్లు మొక్కుతారు...ఇక్కడ తిడతారు : కేసీఆర్ తీరు పై ఎంపీ సోయం ఆగ్రహం

  • అందుకే సీఎంకు అపాయింట్ మెంట్ ఇవ్వవద్దని కోరా
  • కేంద్రం నిధులివ్వకుంటే రాష్ట్రం నడప లేరు 
  • ఇచ్చిన నిధులను కూడా పక్కతోవ పట్టిస్తున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళితే బీజేపీ పెద్దలు, ప్రధాని మోదీ కాళ్లు మొక్కుతారని, హైదరాబాద్ రాగానే వారిని తిడతారని అదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు విమర్శించారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే ఒక్క క్షణం కూడా ప్రభుత్వం నడపలేని స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని, అయినా కేసీఆర్ లో భేషజానికి లోటులేదని ఎద్దేవా చేశారు. దీన్ని గుర్తించే తాను సీఎంకు అపాయింట్ మెంట్ ఇవ్వవద్దని ప్రధానిని కోరినట్లు చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా దివాలా స్థితిలో ఉందని, ఆ పరిస్థితుల్లోనూ కేంద్రం ఇచ్చే నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో రాష్ట్రం సర్వనాశనం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని, తెలంగాణలో త్వరలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని జోస్యం చెప్పారు.

More Telugu News