India: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ

  • కటక్ వేదికగా వెస్టిండీస్ తో మూడో వన్డే 
  • వన్డే సిరీస్ లో చెరో విజయం సాధించిన ఇరు జట్లు
  • నేటి వన్డేలో గెలిచిన వారికే కప్

కటక్ వేదికగా వెస్టిండీస్ తో జరగుతోన్న మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, కేదార్ జాధవ్, రవీంద్ర జడేజా, షమీ, ఠాకూర్, కే యాదవ్, ఎన్ సైని ఉన్నారు. మూడు వన్డేల సిరీస్ మొదటి మ్యాచ్ లో వెస్టిండీస్ గెలిచింది. విశాఖలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా గెలుపొందింది. దీంతో ఇరు జట్లు 1-1తో సమ ఉజ్జీలుగా నిలిచాయి. నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచిన జట్టే సిరీస్ విజేతగా నిలుస్తుంది.

More Telugu News