Nizamabad District: ఉంగరం గొంతులో ఇరుక్కోవడంతో విలవిల్లాడిపోయిన ఐదు నెలల చిన్నారి

  • నిజామాబాద్‌ పట్టణంలో ఘటన
  • ఎక్స్‌రే తీసిన వైద్య సిబ్బంది
  • చికిత్స చేసి ఉంగరాన్ని తొలగించిన వైద్యులు  

ఐదు నెలల బాలుడు ఉంగరాన్ని మింగేసిన ఘటన నిజామాబాద్‌ పట్టణంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు చేతికి పెట్టిన ఉంగరాన్ని ఆడుకుంటోన్న సమయంలో యాసిన్ అనే బాలుడు మింగేశాడు. దీంతో అది అతడి గొంతులో ఇరుక్కుంది. ఈ విషయాన్ని గుర్తించిన అతడి తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం వెంటనే అతడిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆసుపత్రిలో వైద్యులు ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించడంతో ఆ బాలుడి గొంతులో ఉంగరం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే చికిత్స చేసిన  వైద్యులు ఉంగరాన్ని తొలగించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. చిన్నారి యాసిన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

More Telugu News