flag: అతి భారీ త్రివర్ణ పతాకంతో సీఏఏకు మద్దతుగా ర్యాలీ.. వీడియో ఇదిగో

  • నాగ్ పూర్ లో ర్యాలీ
  • పాల్గొన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్
  • మరోవైపు సీఏఏకు వ్యతిరేకంగా కొనసాగుతోన్న నిరసనలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చట్టానికి మద్దతు తెలుపుతూ మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో లోక్ అధికార్ మంచ్ ఆధ్వర్యంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు, కార్యకర్తలతో పాటు పలు సంస్థలు భారీ ర్యాలీ నిర్వహించాయి.

అతి భారీ త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని నాగ్ పూర్ లో ఈ ర్యాలీని కొనసాగిస్తున్నారు. బెంగళూరులోనూ సీఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మరోవైపు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పలు యూనివర్సిటీలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News