Ayyanna Patrudu: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసు కేసు నమోదు!

  • ఇటీవల వైసీపీలో చేరిన సన్యాసినాయుడు
  • ఇంటిపై వైసీపీ జెండా కట్టడంతో గొడవ
  • బందోబస్తుకు వెళ్లిన వారిని దూషించిన అయ్యన్నపాత్రుడు

గతంలో పోలీసులను దూషించిన కేసులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఖరారు చేసిన నర్సీపట్నం టౌన్ సీఐ స్వామినాయుడు, అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసినాయుడు, తన నివాసంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టిన నేపథ్యంలో, ఈ నెల 12న అన్నదమ్ముల మధ్య గొడవ జరిగిందని ఆయన తెలిపారు. ఇరు వర్గాల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని, శాంతిభద్రతలను కాపాడేందుకు, పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు, తాము బందోబస్తును ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఆ సమయంలో పోలీసు విధులకు భంగం కలిగించిన అయ్యన్నపాత్రుడు, వారిని అకారణంగా దూషించారని, దీనిపై కేసును రిజిస్టర్ చేశామని అన్నారు. కాగా, నర్సీపట్నం మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చింతకాయల సన్యాసిపాత్రుడు, ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

More Telugu News