Nirav Modi: ఒక్కొక్కటిగా బయటికొస్తున్న నీరవ్ మోదీ లీలలు!

  • పీఎన్ బీ స్కాంలో ప్రధాన నిందితుడిగా నీరవ్ మోదీ
  • ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్న నీరవ్
  • తన కంపెనీలోని డైరెక్టర్ కే సోదరుడి సాయంతో బెదిరింపులు

దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో పీఎన్ బీ స్కాం ఒకటి. ఇందులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ. ప్రస్తుతం బ్రిటన్ జైల్లో కాలం గడుపుతున్నాడు. ఎన్నిసార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా ప్రతిసారి నిరాశే! ఈ నేపథ్యంలో, నీరవ్ మోదీ నిర్వాకం మరొకటి వెలుగులోకి వచ్చింది. పీఎన్ బీ స్కాం తెరపైకి రావడంతో, నీరవ్ మోదీ సంస్థలో డైరెక్టర్ హోదాలో ఉన్న ఆశిష్ మోహన్ భాయ్ లాడ్ ఈజిప్టుకు పరారయ్యాడు. అప్పటివరకు దుబాయ్ లో ఉన్న ఆయన అరెస్ట్ చేస్తారన్న భయంతో కైరో పారిపోయాడు.

కానీ, గతేడాది భారత్ రావాలని ఆశిష్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన నీరవ్ మోదీ తీవ్రమైన బెదిరింపులకు దిగాడు. ఆశిష్ భారత్ అధికారులకు పట్టుబడితే తన గుట్టు బయటపడుతుందని భయపడ్డాడు. అందుకే, భారత్ వెళితే చంపేస్తాం అంటూ తన సోదరుడి సాయంతో ఆశిష్ ను హెచ్చరించాడు. అంతేకాదు, తనకు అనుకూలంగా న్యాయస్థానంలో సాక్ష్యం చెబితే రూ.20 లక్షలు ఇస్తామంటూ ఓ ఆఫర్ కూడా చేశాడు. కానీ ఆశిష్ అందుకు అంగీకరించలేదు.

More Telugu News