Disha: దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశం

  • సోమవారం సాయంత్రం వరకు గడువు విధించిన హైకోర్టు
  • ఢిల్లీ ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం నిర్వహించాలని స్పష్టీకరణ
  • మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని ఆదేశం

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ కొనసాగించింది. ఢిల్లీ ఫోరెన్సిక్ నిపుణులతో దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ సోమవారం సాయంత్రం ఐదు గంటల లోపు పూర్తవ్వాలని గడువు విధించింది. రీపోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఎన్ కౌంటర్ లో పోలీసులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని సిట్ కు స్పష్టం చేసింది. ఈ ఉదయం నుంచి హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ విచారణకు గాంధీ ఆసుపత్రి వర్గాలు కూడా హాజరయ్యాయి.

More Telugu News