Sai Dharam Tej: 'ప్రతిరోజూ పండగే' నైజామ్ లో తొలిరోజు వసూళ్లు

  • నిన్ననే విడుదలైన 'ప్రతిరోజూ పండగే'
  • తొలి ఆటతోనే దక్కిన పాజిటివ్ టాక్ 
  • సత్యరాజ్ .. రావు రమేశ్ నటన హైలైట్

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందిన 'ప్రతిరోజూ పండగే' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. నైజామ్ లోను ఈ సినిమా తొలిరోజున మంచి వసూళ్లను సాధించింది.

తొలిరోజున నైజామ్ లో 1.25 కోట్ల షేర్ ను వసూలు చేసింది. గతంలో సాయిధరమ్ తేజ్ చేసిన సినిమాలతో పోల్చుకుంటే, తొలిరోజున ఈ సినిమా నైజామ్ లో అత్యధిక వసూళ్లను సాధించినట్టేనని అంటున్నారు. ఈ రోజు .. రేపు రాబట్టే వసూళ్లు మరింత ఎక్కువగా వుండే అవకాశం వుందని అంటున్నారు. సత్యరాజ్ .. రావు రమేశ్ ల నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. సాయిధరమ్ తేజ్ కి మరో హిట్ పడినట్టేననే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.

More Telugu News