YSRCP: జగన్ గతంలో రాజధానిగా అమరావతిని అంగీకరించారు: ధూళిపాళ్ల నరేంద్ర

  • పార్టీల కోసం, మా కోసం కాదు.. రైతుల కోసమే ఈ ఉద్యమం
  • మా ప్రాంతాల్లోనూ రాజధానికి అనుకూలంగా ఉద్యమాలు చేస్తాం
  • సీఎంలు మారొచ్చు కానీ ఒప్పందాలు మారకూడదు

గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని సమర్థించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం మరోలా మాట్లాడుతున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'పార్టీల కోసం, మా కోసం కాదు రైతుల కోసమే ఈ ఉద్యమం. మా ప్రాంతాల్లోనూ రాజధానికి అనుకూలంగా ఉద్యమాలు చేస్తాం. సీఎంలు మారొచ్చు కానీ ఒప్పందాలు మారకూడదు. జగన్ గతంలో రాజధాని అమరావతిని అంగీకరించారు' అని ఆయన వ్యాఖ్యానించారు. రాజధానిని మార్చుతామని జగన్ ప్రకటన చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు.

More Telugu News