Sarileru Neekevvaru: 'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి

  • మహేశ్ బాబు, రష్మిక జంటగా సరిలేరు నీకెవ్వరు చిత్రం
  • జనవరి 5న హైదరాబాదులో ప్రీరిలీజ్ ఈవెంట్
  • ఎల్బీ స్టేడియంలో వేడుక

మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 5న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.

2020 ఏడాది ఆరంభంలో అతిపెద్ద సంరంభానికి మరింత వన్నె తీసుకువచ్చేలా చిరంజీవి గారు సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ కు వస్తున్నారని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ ట్వీట్ చేసింది. ఈ కార్యక్రమానికి హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. కాగా, సంక్రాంతి కానుకగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

More Telugu News