amaravathi: ఆర్థిక ఇబ్బందులుంటే అన్ని రాజధానులెందుకు? : కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

  •  రాజధాని వికేంద్రీకరణ లాభదాయకం కాదు 
  •  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు 'కొత్త'మోజు 
  • తమ స్వార్థం కోసం కొత్త రాజధానులంటున్నారు

ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆర్థిక భారమైన అన్ని రాజధానుల నిర్మాణానికి ఎందుకు పూనుకుంటున్నారని తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వి. హెచ్.హనుమంతరావు ప్రశ్నించారు. రాజధాని వికేంద్రీకరణ వల్ల నష్టమే తప్ప లాభం ఉందని వ్యాఖ్యానించారు.

 ఈ రోజు ఆయన ఓ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరికీ కొత్త మోజు ఎక్కువ చేశారు. తమ స్వార్థం కోసం కొత్త రాజధానుల జపం చేయడం మంచిదికాదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో జగన్ ను కేంద్రమే నియంత్రించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న కేంద్రం రాజధాని విషయంలోనూ జగన్‌ను నియంత్రించాలని కోరారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం నిలిపివేయాలని, బ్యాంకు రుణాలు రాకుండా అడ్డుకోవాలని సూచించారు.

More Telugu News