Telangana: తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు

  • కరీంనగర్, ఖమ్మంలో రెండేసి కోర్టులు
  • మిగతా జిల్లాల్లో ఒక్కో కోర్టు 
  • అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో పని చేస్తాయి

అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల సత్వర విచారణ విషయమై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో రెండేసి చొప్పున, మిగతా జిల్లాల్లో ఒక్కో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆయా జిల్లాల అదనపు సెషన్స్ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పని చేయనున్నాయి.

కాగా, దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు విషయమై సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు గత ఆగస్టులో రాష్ట్రాల హైకోర్టులకు కేంద్ర న్యాయశాఖ లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 5న తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడి హైకోర్టు లేఖ రాయడం జరిగింది.

More Telugu News