Disa: నష్టపరిహారం ఇప్పించమంటూ సుప్రీంను ఆశ్రయించిన దిశ నిందితుల కుటుంబాలు

  • ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి 
  • పోలీసులపై చర్యలు తీసుకోవాలి
  • ఎన్ కౌంటర్ ఘటనపై విచారణ జరిపించాలి

తెలంగాణలో జరిగిన ‘దిశ’ అత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ ఘటన తర్వాత కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ నిందితుల తరఫు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిందితుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చేలా చూడాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాయి. అంతేకాకుండా, ఎన్ కౌంటర్ ఘటనపై దర్యాప్తు చేయాలని, ఈ ఘటనకు పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

More Telugu News