Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 115 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 38 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6 శాతం పైగా లాభపడ్డ యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత కాసేపు నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు ఆ తర్వాత లాభాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 115 పాయింట్లు లాభపడి 41,674కు చేరుకుంది. నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 12,260 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (6.42%), టీసీఎస్ (3.03%), భారతి ఎయిర్ టెల్ (2.83%),  టాటా మోటార్స్ (2.60%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.37%).

టాప్ లూజర్స్:
వేదాంత లిమిటెడ్ (-2.49%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.34%), సన్ ఫార్మా (-1.33%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.82%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.64%).

More Telugu News