onions: ఆ దుకాణంలో వస్త్రాలు కొంటే ఉల్లి ఉచితం!

  • మహారాష్ట్రలోని ఉద్గిరిలో వ్యాపారి ఆఫర్
  • క్వింటాల్ ఉల్లిని కొనుగోలు చేసి తన దుకాణానికి తెచ్చుకున్న వ్యాపారి
  • రూ.1000 వస్త్రాలు కొన్నవారికి కిలో ఉల్లిగడ్డలు ఫ్రీ
  • రూ.10 వేల వస్త్రాలు కొన్న వారికి 15 కిలోల ఉల్లి ఉచితం

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఉద్గిరిలోని ఓ దుకాణంలో వస్త్రాలను కొంటే కిలో ఉల్లి ఉచితంగా ఇస్తున్నారు. ఈ ఆఫర్ ప్రకటించడంతో ఆ దుకాణంలో గిరాకీ పెరిగింది. ఇందుకోసం ఆ వస్త్ర వ్యాపారి ప్రేం రాజ్‌పాల్ క్వింటాల్ ఉల్లి గడ్డలను కొనుగోలు చేసి తన దుకాణానికి తెచ్చుకున్నాడు.

తమ దుకాణంలో రూ.1000 విలువ చేసే వస్త్రాలు కొన్నవారికి కిలో ఉల్లిగడ్డలు, రూ.10 వేల వస్త్రాలు కొన్న వారికి 15 కిలోల ఉల్లిగడ్డలను ఉచితంగా ఇస్తామని చెప్పారు.  ఉల్లిధరలు పెరగడం, మరోవైపు పెళ్లిళ్ల సీజను నేపథ్యంలో తాను వస్త్రాలు కొనే వారికి ఉచితంగా ఉల్లిని ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ప్రేంరాజ్‌ పాల్ మీడియాకు చెప్పారు. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లోనూ పలువురు వ్యాపారులు ఈ ఐడియానే అనుసరిస్తూ గిరాకీని పెంచుకుంటున్నారు.

More Telugu News