High Court: హైకోర్టు తరలింపుపై అభ్యంతరం.. విజయనగరం లాయర్ల నిరసన

  • హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని చెప్పడంపై విజయనగరం లాయర్ల ఆందోళన
  • ప్రజలు, లాయర్లు ఇబ్బంది పడతారని వ్యాఖ్య
  • అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్

రాష్ట్రానికి మూడు రాజధానులు వచ్చే అవకాశం ఉందంటూ ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా... మరి కొందరు తప్పుబడుతున్నారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మారుస్తామని చెప్పడంపై ఉత్తరాంధ్ర లాయర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా లాయర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ ఉదయం విజయనగరంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హైకోర్టును కర్నూలుకు తరలించడం వల్ల ప్రజలు, లాయర్లు ఇబ్బంది పడతారని చెప్పారు. అమరావతిలోనే హైకోర్టును కొనసాగించాలని... లేని పక్షంలో విశాఖపట్టణంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News