jail: సంచలనం! బాలికపై అత్యాచారం చేసిన దుర్మార్గుడికి 17 రోజుల్లోనే శిక్ష విధిస్తూ తీర్పు!

  • రాజస్థాన్‌లోని చురులో ఘటన
  • ఏడు రోజుల్లోనే పోలీసుల చార్జిషీటు
  • నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు

అభం, శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గుడికి  కోర్టు 17 రోజుల్లోనే శిక్ష విధించింది. రాజస్థాన్‌లోని చురు ప్రాంతంలో జరిగిందీ ఘటన. గత నెల 30న దయారాం మేఘ్వాల్ అనే వ్యక్తి నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాతి రోజు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ నెల 7న చార్జిషీటు దాఖలు చేయగా, పోక్సో చట్టం కింద ఏర్పాటైన కోర్టు రోజువారీ విచారణ జరిపింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఏడు రోజుల్లోనే పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయగా, కోర్టు 17 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి శిక్ష విధించడం గమనార్హం. పోక్సో చట్టం కింద ఇంత స్వల్ప సమయంలో నిందితుడికి శిక్ష పడడం ఇదే తొలిసారి.

More Telugu News