Yediyurappa: కర్ణాటకలో పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తాం: యడియూరప్ప

  • పౌరసత్వ చట్టాన్ని అమలు చేయబోమన్న పలు రాష్ట్రాలు
  • చట్టంపై దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు
  • ఇందిరా క్యాంటీన్ల పేర్లను మార్చబోమన్న యెడ్డీ

పౌరసత్వ సవరణ చట్టాన్ని కర్ణాటకలో అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. ఈ చట్టాన్ని తాము అమలు చేయబోమని పంజాబ్, పశ్చిమబెంగాల్ తో పాటు మరికొన్న రాష్ట్రాలు ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరులో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న ఇందిరా క్యాంటీన్ల పేరును మార్చే యోచన తమకు లేదని తెలిపారు. ఈ క్యాంటీన్ల పేరును 'మహర్షి వాల్మీకి అన్న కుటీర'గా మారుస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. మరోవైపు, పౌరసత్వ చట్టంపై దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చట్టం అమలుపై స్టే విధించాలన్న పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అయితే, చట్టాన్ని తాము పరిశీలిస్తామని చెప్పింది.

More Telugu News