Vizag: విశాఖలో నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు

  • విశాఖలో రెండో వన్డే
  • టాస్ గెలిచిన విండీస్
  • మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా

తొలి వన్డే ఓటమి టీమిండియా ఆటగాళ్లలో కసి రేకెత్తించినట్టుంది! విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్ ఎంతో నిలకడ ప్రదర్శిస్తున్నారు. అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపిస్తున్నారు. ఈ మ్యాచ్ లో విండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ కే మొగ్గుచూపింది. ప్రస్తుతం టీమిండియా 19 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 96 పరుగులు చేసింది. రాహుల్ అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా, రోహిత్ శర్మ 40 పరుగులతో ఆడుతున్నాడు.

More Telugu News