Kadapa: కడప స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓర్ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్ఎండీసీ ఒప్పందం

  • కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
  • త్వరలో శంకుస్థాపన
  • ఎన్ఎండీసీతో ఒప్పందం చారిత్రాత్మకమన్న సీఎం జగన్

త్వరలోనే కడప స్టీల్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. ఈ క్రమంలో ఓ కీలక ఒప్పందం కుదిరింది. కడప స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓర్ ను సరఫరా చేసేందుకు ఎన్ఎండీసీ ముందుకువచ్చింది. ఈ మేరకు సీఎం జగన్ సమక్షంలో ఎన్ఎండీసీ వర్గాలు, ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ యాజమాన్యం మధ్య అవగాహన ఒప్పందం ఖరారైంది. ఈ సమావేశంలో ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా కూడా పాల్గొన్నారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ, ఇది చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం అని అన్నారు.

More Telugu News