West Indies: విశాఖ వన్డే: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

  • విశాఖలో రెండో వన్డే
  • తొలి వన్డేలో విండీస్ చేతిలో భారత్ పరాజయం
  • రెండో వన్డేలో గెలవాలన్న కసితో టీమిండియా

భారత్, వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య విశాఖపట్నంలో జరుగుతోన్న రెండో వన్డేలో టాస్ గెలిచిన విండీస్ మొదట బౌలింగ్ ను ఎంచుకుంది. ఇటీవల జరిగిన మొదటి వన్డేలో భారత్ పై వెస్టిండీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే ఉత్సాహంతో ఈ వన్డేలోనూ గెలవాలన్న పట్టుదలతో వెస్టిండీస్ ఉంది. ఈ వన్డేలోనైనా గెలిచి తీరాలని టీమిండియా కసిగా ఉంది.

భారత జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ జాదవ్, దీపక్ చాహర్, షమీ, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. మొదటి వన్డేలో ఆడిన శివం దూబెను రెండో వన్డేలో తీసుకోలేదు.

More Telugu News