Andhra Pradesh: ఏపీ శాసనమండలిలో ఆరు కీలక బిల్లులకు సభ్యుల ఆమోదం

  • కొనసాగుతున్న మండలి సమావేశాలు
  • 11 బిల్లులు ప్రవేశపెట్టిన సర్కారు
  • ఆమోదం పొందని బిల్లులపై రేపు చర్చ

ఏపీ శాసనమండలిలో ఆరు కీలక బిల్లులకు సభ్యులు సానుకూలంగా స్పందించారు. మండలి సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లులు సభ్యుల ఆమోదం పొందాయి. మొత్తం 11 బిల్లులు ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ అనంతరం 6 బిల్లులకు పచ్చజెండా ఊపారు. మిగిలిన బిల్లులపై రేపు చర్చ కొనసాగనుంది.

ఆమోదం పొందిన బిల్లులు ఇవే...

  •  ఏపీ ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లు
  • ఏపీ పాఠశాల విద్యా క్రమబద్ధీకరణ, పర్యవేక్షణ కమిషన్ చట్టం సవరణ బిల్లు
  • ఏపీ దిశ చట్టం- మహిళలు, బాలికలపై నిర్దేశిత నేరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానం చట్టం 2019 బిల్లు
  • ఏపీ ధార్మిక, హిందూ మత సంస్థల దేవాదాయ చట్టం సవరణ బిల్లు
  • ఏపీ దిశ చట్టం-క్రిమినల్ శాసనచట్టం 2019 బిల్లు
  • ఏపీ సాంస్కృతిక, వారసత్వపు బోర్డు చట్టం సవరణ బిల్లు

More Telugu News