Tirumala: రేపు, ఎల్లుండి టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం ‘సుపథం’

  • వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల కోసం ‘సుపథం’
  • రేపు 4 వేల మంది వృద్ధులు, దివ్యాంగులకు అనుమతి
  • ఎల్లుండి మరో 4 వేల మంది చంటిపిల్లల తల్లిదండ్రులకు

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ప్రతి నెలా రెండు రోజుల పాటు ‘సుపథం’ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కల్పిస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల కోసం ఉద్దేశించిన ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం రేపు, ఎల్లుండి అందుబాటులో ఉండనుంది. రేపు నాలుగు వేల మంది వృద్ధులు, దివ్యాంగులకు, ఎల్లుండి మరో నాలుగు వేల మంది చంటిపిల్లల తల్లిదండ్రులను ఈ దర్శనం ద్వారా అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

More Telugu News