Philippines: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం... ముగ్గురి దుర్మరణం

  • రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదు
  • భారీగా ఆస్తి నష్టం
  • దవావోకు 90 కిమీ దూరంలో భూకంప కేంద్రం

ఫిలిప్పీన్స్ ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రత నమోదైంది. ఫిలిప్పీన్స్ లోని దవావో నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఈ  భూకంపం ప్రభావంతో ఫిలిప్పీన్స్ దక్షిణ భాగంలో ముగ్గురు మరణించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పెద్ద శబ్దంతో భూకంపం సంభవించడంతో ప్రజలు ఆఫీసులు, షాపింగ్ మాల్స్, ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) పేర్కొంది. కాగా, భూకంప బాధితుల్లో ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News