Krishna District: కృష్ణా జిల్లాలో రోడ్డుప్రమాదం..హోం గార్డు మృతి

  • నందివాడ మండలం జొన్నపాడు దగ్గర ఘటన
  • బైక్ పై అతివేగంగా వచ్చి హోంగార్డును ఢీ కొట్టారు
  • ముగ్గురు యువకుల పరిస్థితి విషమం 

కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హోం గార్డు మృతి చెందాడు. నందివాడ మండలం జొన్నపాడు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. బైక్ పై అతివేగంగా వస్తున్న యువకులు హోంగార్డు గోవర్ధన్ ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో గోవర్ధన్ ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News