Visakhapatnam District: ‘రైతు భరోసా’నగదు కోసం వివాదం.. తమ్ముడి కుటుంబంపై అన్న కాల్పులు!

  • విశాఖపట్టణం జిల్లాలో జరిగిన ఘటన
  • ‘రైతు భరోసా’లోతన వాటా డబ్బు అడిగిన తమ్ముడు
  • తమ్ముడి భార్య చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్ 

ఏపీలో రైతు భరోసా పథకం కింద ఇచ్చిన నగదు కోసం అన్మదమ్ముల మధ్య తలెత్తిన వివాదం కాల్పుల వరకు వెళ్లింది. విశాఖపట్టణం జిల్లాలోని హుకుంపేట మండలం రంగశీలలో ఈ ఘటన జరిగింది. తన వాటా డబ్బులు అడిగిన తమ్ముడి కుటుంబంపై ఆగ్రహించిన అన్నయ్య కృష్ణ తన నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. స్థానికుల సాయంతో కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడ్డ కృష్ణ పరారీలో ఉన్నాడు.

More Telugu News