Sarileru Neekevvaru: 'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు

  • మహేశ్ బాబు, రష్మిక జంటగా కొత్త చిత్రం
  • జనవరి 11న రిలీజ్
  • జనవరి 5న హైదరాబాదులో ప్రీరిలీజ్ ఈవెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. అయితే, సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు అభిమానులను ఉర్రూతలూగించే రీతిలో అత్యంత ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. జనవరి 5న హైదరాబాదులో ఈ ముందస్తు వేడుక జరపాలని ముహూర్తం ఫిక్స్ చేశారు. నగరంలోని ఎల్బీ స్టేడియం ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు వేదికగా నిలవనుంది. ఈ మేరకు చిత్రయూనిట్ ప్రకటించింది.

More Telugu News