Team India: ఆరంభంలోనే రెండు వికెట్లు డౌన్.. కష్టాల్లో టీమిండియా

  • విండీస్ తో వన్డే సిరీస్ ఆరంభం
  • చెన్నైలో తొలి మ్యాచ్  
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్

చెన్నై వన్డేలో టీమిండియా మొదట్లోనే కీలక వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (4) స్వల్ప స్కోర్లకు పెవిలియన్ చేరారు. ఈ రెండు వికెట్లు విండీస్ పేసర్ షెల్డన్ కాట్రెల్ ఖాతాలో పడ్డాయి. ప్రస్తుతం టీమిండియా స్కోరు 12 ఓవర్లలో 2 వికెట్లకు 46 పరుగులు. ఓపెనర్ రోహిత్ శర్మ (21 బ్యాటింగ్), శ్రేయాస్ అయ్యర్ (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న ఈ తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

More Telugu News