shiv sena: కలిసే నిర్ణయం తీసుకున్నాం.. కానీ, ఇప్పుడు ఆ పనులను శివసేన అడ్డుకుంటోంది: ఫడ్నవీస్

  • శివసేనపై ఫడ్నవీస్ విమర్శలు
  • గతంలో శివసేన మాతో కలిసి పనిచేసింది
  • ఇరు పార్టీలు కలిసి పలు నిర్ణయాలు తీసుకున్నాయి
  • ఇప్పుడు అందుకు విరుద్ధంగా శివసేన తీరు

శివసేనపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. గతంలో రాష్ట్రంలో తాము శివసేనతో కలిసే మహారాష్ట్రలో అధికారంలో ఉన్నామని, అప్పుడు ఆ పార్టీ నేతలతో కలిసి ఎన్నో నిర్ణయాలు తీసుకుని పనులు ప్రారంభించామని అన్నారు. ఇప్పుడు తమ నిర్ణయాలకు వ్యతిరేకంగా శివసేన వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఈ రోజు ఫడ్నవీస్ నాగ్ పూర్ లో మీడియాతో మాట్లాడుతూ... 'గతంలో శివసేన మాతో కలిసి పనిచేసింది. ఇరు పార్టీలు కలిసి పలు నిర్ణయాలు తీసుకున్నాయి. కానీ, గతంలో తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అభివృద్ధి పనులను ఆ పార్టీ ఆపేస్తోంది' అని విమర్శించారు.

More Telugu News