Road Accident: నేపాల్ లో లోయలోకి దూసుకువెళ్లిన బస్సు :14 మంది దుర్మరణం

  • పలువురికి తీవ్రగాయాలు 
  • ప్రమాద సమయానికి బస్సులో 40 మంది ప్రయాణికులు 
  • సింధుపాక్ చౌక్ జిల్లాలో ఘటన

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింధుపాక్ చౌక్ జిల్లాలోని కాలిన చౌక్ మందిరానికి వెళ్తుండగా అదుపుతప్పిన బస్సు లోయలోకి దూసుకువెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయానికి బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా అందులో 14 మంది దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.  డోలాఖా ఖాదీచౌర్ - జిరి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోయలో పడిపోయింది. ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

More Telugu News