ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

  • చెన్నైలో తొలి వన్డే
  • టీ20 సిరీస్ లో గెలిచిన ఉత్సాహంతో టీమిండియా
  • వన్డే సిరీస్ లోనైనా గెలవాలన్న కసితో వెస్టిండీస్

భారత్, వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతోన్న తొలి వన్డేలో టాస్ గెలిచిన విండీస్ మొదట బౌలింగ్ ను ఎంచుకుంది. ఇటీవల జరిగిన టీ20 సిరీస్ లో వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే ఉత్సాహంతో విండీస్ పై వన్డేల్లోనూ గెలవాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది. వన్డే సిరీస్ లోనైనా గెలవాలని వెస్టిండీస్ కసిగా ఉంది.
  భారత జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, శివం దూబె, రవీంద్ర జడేజా, కుల్దీప్ జాదవ్, దీపక్ చాహర్, షమీ ఉన్నారు. 

More Telugu News