Vijay Sai Reddy: ఏపీ 'దిశ' చట్టంపై కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయి: విజయసాయి రెడ్డి

  • మహిళలపై ఘోరాలు జరిగితే చంద్రబాబు ప్రచారం కోసం వాడుకున్నారు
  • చంద్రబాబు ఏనాడూ కఠిన చట్టాలు తేలేదు
  • దిశ యాక్ట్ వల్ల నేరగాళ్లు 21 రోజుల్లోనే ఉరికంబం ఎక్కుతారు
  • జగన్ గారు ఇచ్చిన భరోసా మహిళల్లో ధైర్యం నింపింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొనియాడారు. ఈ చట్టం గురించి అన్ని రాష్ట్రాలు తెలుసుకోవాలనుకుంటున్నాయని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ఇటువంటి  చట్టాలని తీసుకురాలేదని విమర్శించారు. ఏపీ సీఎం జగన్ ఇస్తోన్న భరోసాతో మహిళల్లో ధైర్యం నిండుతోందని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.  

 'ఏపీ దిశ చట్టంపై కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయి. మహిళలు, పసి పిల్లలపై ఘోరాలు జరిగితే ప్రచారం కోసం వాడుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు ఏనాడూ కఠిన చట్టాలు తేలేదు. ఈ యాక్ట్ వల్ల నేరగాళ్లు 21 రోజుల్లోనే ఉరికంబం ఎక్కుతారని జగన్ గారు ఇచ్చిన భరోసా మహిళల్లో ధైర్యం నింపింది' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

More Telugu News