High Court: ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులేంటి?: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న

  • ఏ ప్రాతిపదికన వేస్తున్నారు
  • పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు కలెక్టర్‌కు ఆదేశం
  • పంచాయతీ కార్యాలయానికి రంగులపై పిటిషన్‌ దాఖలు

ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ వైసీపీ జెండా రంగులతో నింపేస్తున్న ఏపీ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ  రంగులు ఏమిటని కోర్టు నిలదీసింది. అసలు ఏ ప్రాతిపదికన రంగులు వేశారో పది రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ గుంటూరు కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ జెండా రంగులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపిన న్యాయ స్థానం ప్రభుత్వం తీరుపై తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ జెండా రంగులు ఎలా వేస్తున్నారని ప్రశ్నించింది.

More Telugu News