Andhra Pradesh: ఏపీ అధికారిక కార్యక్రమంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి.. మంత్రి వెల్లంపల్లి హర్షం

  • ఈ నెల 15న పొట్టి శ్రీరాములు వర్ధంతి
  • సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
  • రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వర్ధంతి కార్యక్రమాలు

అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కి వెల్లంపల్లి, పొట్టిశ్రీరాములు అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించేందుకు చర్యలు  తీసుకోవాల్సిందిగా అన్నిప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.

More Telugu News